లోక్ సభ ఎన్నికలు -2024 నిర్వహణలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించాలని నాగర్ కర్నూలు జిల్లా రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా అధికారుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ లోక్ సభ ఎన్నికల నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న వివిధ శాఖల అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా పోస్టల్ బ్యాలెట్
ఫారం -12 ని వినియోగించుకోవాలన్నారు.