బీజేపీ మేనిఫెస్టో కమిటీలో తెలుగు వారికి నో చాన్స్!

68చూసినవారు
బీజేపీ మేనిఫెస్టో కమిటీలో తెలుగు వారికి నో చాన్స్!
రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం బీజేపీ జాతీయ ఎన్నికల మేనిఫెస్టో కమిటీని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీ తెలుగు వారికి చోటు దక్కలేదు. అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణకు చెందిన నేతలు లేకపోవడం గమనార్హం. జాతీయ మేనిఫెస్టో కమిటీలో తెలుగు వారిని పెట్టకపోవడం రాజకీయ వర్గాల్లో సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన 27 మందితో కమిటీని శనివారం ఆ పార్టీ ప్రకటించింది.

సంబంధిత పోస్ట్