అఖిల భారత ఫుట్బాల్ సమాఖ్య (AIFF) ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ దీపక్ శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై తాజాగా ఇద్దరు క్రీడాకారిణులు తీవ్ర ఆరోపణలు చేశారు. ఆయన తమ హోటల్ గదికి వచ్చి భౌతిక దాడికి పాల్పడ్డారంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన పోలీసులు దీపక్ శర్మను అదుపులోకి తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ఖాద్ ఫుట్బాల్ క్లబ్కు చెందిన ఇద్దరు క్రీడాకారిణులు ఈ ఆరోపణలు చేశారు.