రిజర్వేషన్లు రద్దు చేస్తారని ప్రధాని మోదీని బద్నాం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకులు అన్నారు. నారాయణపేట లో విలేకరులతో మాట్లాడారు. ఎంపీగా ఉన్న సమయంలో సభలో ఒక్క ప్రశ్న అడగలేదని అన్నారు. రేవంత్ రెడ్డి బీజేపీ పై బట్ట కాల్చి వేస్తున్నారని, ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై తమ ఆగ్రహం చూపుతారని అన్నారు. రేవంత్ రెడ్డి ఐరన్ లెగ్ వంటి వారని అన్నారు.