పేకాట స్థావరంపై పోలీసుల దాడులు

1089చూసినవారు
పేకాట స్థావరంపై పోలీసుల దాడులు
దామరగిద్ద మండలం సజనాపూర్ గ్రామంలో శుక్రవారం పేకాట స్థావరంపై పోలీసులు దాడులు చేసినట్లు ఎస్సై వసంత తెలిపారు. గ్రామంలోని ఓ ఇంట్లో బెట్టింగ్ కాస్తూ పేకాట ఆడుతున్నారని విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు దాడులు చేసినట్లు చెప్పారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుండి రూ. 5, 820 నగదు, నాలుగు సెల్ ఫోన్లు, పేక ముక్కలు స్వాధీనం చేసుకున్నామని, అయిదు మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్