తండ్రిపై దాడి.. కుమారుడిపై కేసు నమోదు

5559చూసినవారు
తండ్రిపై దాడి.. కుమారుడిపై కేసు నమోదు
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లికి చెందిన తిరుపతి హైదరాబాద్ లో డ్రైవర్ గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తిరుపతి భార్య ఏడేళ్ల కిందట విడాకులు తీసుకున్నారు. ఈనెల 9న పండగకు ఆయన ఇంటికి రాగా. తన భార్య విడిపోవడానికి తన తండ్రి రాములు కారణమని భావించి కర్ర తీసుకొని తలపై దాడి చేశాడు. గాయపడ్డ ఆయనను చికిత్స కోసం ఆసుపత్రికి కుటుంబసభ్యులు తరలించారు. శుక్రవారం తండ్రి ఫిర్యాదు మేరకు కొడుకుపై కేసు నమోదైంది.

సంబంధిత పోస్ట్