నాలుగు ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

77చూసినవారు
అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 4ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్నట్లు మంగళవారం ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. శ్రీరంగాపూర్ మండలం పాత నాగరాల గ్రామ వాగునుంచి ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో నిర్వహించిన దాడులలో ట్రాక్టర్లలో ఇసుక లోడు చేస్తున్న వారి వద్ద ఎలాంటి అనుమతి పత్రాలు లేకపోవడంతో నాలుగు ట్రాక్టర్లను స్టేషన్ కు తరలించి, చంద్రశేఖర్, శివ నారాయణ, బ్రహ్మయ్య, బాలరాజు అనే వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు.

సంబంధిత పోస్ట్