భార్యను చంపిన భర్తకు రిమాండ్

11103చూసినవారు
భార్యను చంపిన భర్తకు రిమాండ్
భార్యను భర్త చంపిన ఘటన వనపర్తి జిల్లాలో శనివారం చోటుచేసుకుంది. సీఐ నాగభూషణం రావు వివరాల ప్రకారం. వనపర్తి పట్టణంలోని ఎద్దులగేరికి చెందిన దంపతులు వెంకటేష్, మహేశ్వరి. భర్త ఇతరులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని భార్య అనుమానంతో గొడవ పడేది. మార్చి 15న రాత్రి గొడవ పడగా. భార్య ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చంపేశాడు. శనివారం అతన్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండు తరలించినట్లు సీఐ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్