కర్ణాటకలో తుమకూరు జిల్లా కుణిగల్ సమీపంలో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. యశ్వంత్పూర్-హాసన్ మధ్య ప్రయాణించే రైలు శుక్రవారం బయల్దేరింది. అయితే కుణిగల్ పట్టణ శివారులోని రైల్వేట్రాక్పై హైవోల్టేజీ విద్యుత్ వైరు పడి ఉంది. లోకో పైలట్ వెంటనే రైలు ఆపేశాడు. దీంతో తృటిలో ప్రమాదం తప్పింది. రైల్వే సిబ్బంది సమస్యను పరిష్కరించాక రైలు బయల్దేరింది. ఇది శుక్రవారం జరిగినప్పటికీ తాజాగా వెలుగులోకి వచ్చింది.