పెబ్బేరు గోదాంలో అగ్నిప్రమాదం దురదృష్టకరం: నిరంజన్ రెడ్డి

73చూసినవారు
పదివేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం అగ్నికి ఆహుతి అవ్వడం దురదృష్టకరమని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం జరిగిన ప్రమాదంలో పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులో కాలిపోయిన గోదాంను స్థానిక నాయకులతో కలిసి మంగళవారం ఆయన పరిశీలించారు. రైతుల ప్రయోజనాల కోసం కోట్ల రూపాయలు వెచ్చించి గత ప్రభుత్వం గోదాములు నిర్మించిందని, గోదాముల భద్రతపై ప్రభుత్వం సమీక్ష జరిపి భద్రత కోసం చర్యలు తీసుకోవాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్