భారత్పై నోరు జారి పదవి పోగొట్టుకున్న మాల్దీవుల మాజీ మంత్రి మరియం షియూనా మరోసారి వివాదాస్పద పోస్ట్ చేశారు. ప్రతిపక్ష పార్టీని ఉద్దేశించి చేసిన పోస్ట్లో ఆ పార్టీ లోగోకు బదులు భారత జాతీయ జెండాపై ఉండే అశోక చక్రం ఉంది. దీనిపై విమర్శలు రావడంతో ఉద్దేశపూర్వకంగా తాను ఈ పోస్ట్ చేయలేదని మరియం క్షమాపణలు కోరారు. గతంలో ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనకు సంబంధించి అనుచిత వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయ్యారు.