సిగరెట్‌ తాగుతుండగా వీడియో తీశాడని దారుణ హత్య

567చూసినవారు
సిగరెట్‌ తాగుతుండగా వీడియో తీశాడని దారుణ హత్య
మహారాష్ట్రలో దారుణ ఘటన జరిగింది. తాను సిగరెట్‌ తాగుతుండగా వీడియో తీశాడనే కారణంతో ఓ యువతి ఒక వ్యక్తిని హత్య చేసింది. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. జయశ్రీ పాండే అనే యువతి తన స్నేహితురాలితో కలిసి సిగరెట్‌ తాగుతుండగా రంజిత్‌ రాథోడ్‌(28) అనే వ్యక్తి వీడియో తీశాడు. ఇది నచ్చని జయశ్రీ తన స్నేహితులను పిలిచి అతడిపై దాడి చేసింది. ఈ క్రమంలో కత్తితో రాథోడ్‌ను పలుమార్లు పొడవడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్