పూణెలోని పింప్రి-చించ్వాడ్లోని ఒక ప్రతిష్టాత్మక కంపెనీ క్యాంటీన్లో షాకింగ్ ఘటన జరిగింది. అక్కడ సమోసాలలో కండోమ్లు, రాళ్లు, పొగాకు, గుట్కా వంటివి కనిపించాయి. మార్చి 27న ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కంపెనీలో క్యాంటీన్ కాంట్రాక్ట్ మారిందని, పాత కాంట్రాక్టర్ ఈ పనికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ఐదుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటి వరకు ఒకరిని అరెస్ట్ చేశారు.