రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి అల్లుడు ఫైర్

537చూసినవారు
రేవంత్ ప్రభుత్వంపై మల్లారెడ్డి అల్లుడు ఫైర్
మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజీ భవనాలను అధికారులు కూల్చివేశారు. ఈ అంశంపై రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తాము ఎవరి భూమిని కబ్జా చేయలేదని, అది మా పట్టా భూమి అని స్పష్టం చేశారు. 25 ఏళ్ల క్రితమే కాలేజీని ప్రారంభించామని తెలిపారు. అక్రమ భవానాలు ఉన్నాయని వారం రోజుల క్రితం నోటీసులు ఇచ్చారన్నారు. 25 ఏళ్లుగా లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు వచ్చిందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్