వారసంత ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వినతి

71చూసినవారు
వారసంత ఏర్పాటుకు స్థలం కేటాయించాలని వినతి
తాండూర్ మండలం కిష్టంపేట గ్రామంలో పంచాయతీ అభివృద్ధి కోసం ఆదాయం వనరులు పెంచుకునే ఉద్దేశంతో వారసంతను ప్రారంభించడానికి నిర్ణయించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ మేరకు పంచాయతీ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. వారు మాట్లాడుతూ సర్వే నెంబర్ 23, 24 లో గల ప్రభుత్వ స్థలాన్ని వారసంత కొరకు కేటాయించి ఆర్థికంగా వెనుకబడి ఉన్న గ్రామపంచాయతీ ఆదాయం పెంచడానికి అవకాశాన్ని కల్పించాలని కోరారు.