ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: బెల్లంపల్లి ఆర్డీవో హరిప్రసాద్

70చూసినవారు
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: బెల్లంపల్లి ఆర్డీవో హరిప్రసాద్
విస్తారంగా కురుస్తున్న వర్షాలతో బెల్లంపల్లి డివిజన్లోని ఏడు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బెల్లంపల్లి ఆర్డీవో హరిప్రసాద్ శనివారం తెలిపారు. రాబోవు రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నందున బెల్లంపల్లి పట్టణంతో పాటు బెల్లంపల్లి, తాండూర్, కాసిపేట, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి మండలాల ప్రజల జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సహాయం కోసం కలెక్టరేట్ కంట్రోల్ రూంనెంబర్ 08736-250501కు డయల్ చేయాలని సూచించారు.

సంబంధిత పోస్ట్