జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామంలో రెండు నీటి బోర్ల ఏర్పాటు పనులు ప్రారంభమయి. ఈ సందర్భంగా స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న నీటి సమస్యను ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే స్పందించి ఎస్ఢీఎఫ్ నిధులు మంజూరు చేశారని తెలిపారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యేకు వారు కృతజ్ఞతలు తెలిపారు.