ఎస్టీపీపీ కార్మికుల సమస్యలపై చర్చలు

83చూసినవారు
ఎస్టీపీపీ కార్మికుల సమస్యలపై చర్చలు
జైపూర్ లోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ లో కార్మికుల సమస్యలపై మంగళవారం హైదరాబాద్ లోని డిప్యూటీ సెంట్రల్ లేబర్ కమిషనర్ డి. శ్రీనివాసులు సమక్షంలో చర్చలు జరిగాయి. సంస్థ సీఎండీ లేదా డైరెక్టర్లతో 21 రోజుల్లో చర్చించి తదుపరి సమావేశంలో పరిష్కరిస్తామని యాజమాన్యం హామీ ఇచ్చింది. చర్చల్లో బిఎంఎస్ ప్రధాన కార్యదర్శి దుస్స భాస్కర్, నాయకులు సీహెచ్ వెంకటేశ్వర్లు, బి. శ్రీధర్, కె. సతీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్