శ్రీ భగవద్గీత అధ్యయన మండలిలో గురు పుజోత్సవం

52చూసినవారు
శ్రీ భగవద్గీత అధ్యయన మండలిలో గురు పుజోత్సవం
మంచిర్యాల పట్టణంలోని శ్రీ భగవద్గీత అధ్యయన మండలిలో వ్యాస పూర్ణిమను పురస్కరించుకొని ఆదివారం సందర్భంగా గురు పూజోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గీత మండలి వ్యవస్థాపకులు డాక్టర్ గుర్రాల కృష్ణారెడ్డి, కండే ప్రభులింగం, అర్వపల్లి రాజేశం, డాక్టర్ సుగుణాకర్ రెడ్డిలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో సభ్యులు డాక్టర్ కృష్ణ, సునీల్, మాదంశెట్టి సత్యనారాయణ, శ్రీనివాస్, హరీష్, నటేశ్వర్, సత్యం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్