మంచిర్యాల డిసిపి కార్యాలయంలో సోమవారం
హోలీ పండుగ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో డిసిపి అశోక్ కుమార్ తో పాటు జిల్లాలోని పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఒకరికొకరు ఉత్సాహంగా రంగులు చల్లుకున్నారు. అనంతరం డిసిపి అశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా ప్రజలకు
హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా
హోలీ జరుపుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపవద్దని సూచించారు.