రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మధుసూదన్ రెడ్డి

73చూసినవారు
రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా మధుసూదన్ రెడ్డి
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తెలంగాణ రాష్ట్ర శాఖ కార్యవర్గ సభ్యునిగా మంచిర్యాలకు చెందిన వి. మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షుడి ద్వారా ధ్రువీకరించబడిన నియామక పత్రాన్ని శుక్రవారం హైదరాబాద్ లోని కార్యాలయంలో రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యదర్శి మదన్ మోహన్ రావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ కోటిరెడ్డి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్