టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, బాలీవుడ్ నటుడు జాకీ భగ్నానీతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. మరో కొన్ని రోజుల్లో వీరు పెళ్ళి బంధంతో ఒక్కటవబోతున్నారు. ఈ నెల 21న వీరి వివాహం గోవాలో జరగబోతోంది. ఈ క్రమంలో స్నేహితులకు వీరు థాయ్ లాండ్ లో బ్యాచిలర్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీకి టాలీవుడ్ నుంచి మంచు లక్ష్మి, ప్రగ్యా జైస్వాల్ హాజరయ్యారు. రకుల్ కి తెలుగు ఇండస్ట్రీలో మంచు లక్ష్మి చాలా క్లోజ్ అనే విషయం తెలిసిందే.