స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మన్నే జీవన్ రెడ్డిని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారికంగా ప్రకటించారు. సోమవారం రాత్రి హైదరాబాద్లోని ఓ హోటల్లో ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతల సమావేశం నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ అధిష్ఠానం ఆదేశాల మేరకు మన్నే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.