పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు

58చూసినవారు
పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు
తమిళనాడు రాజధాని చెన్నైలోని పలు స్కూళ్లకు బాంబు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. నగర వ్యాప్తంగా ఐదు పాఠశాలలకు గురువారం బెదిరింపు ఈ-మెయిల్స్‌ వచ్చాయి. దీంతో అప్రమత్తమైన ఆయా స్కూల్‌ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. విద్యార్థులు, సిబ్బందిని తక్షణమే ఇంటికి పంపించి పాఠశాలలను మూసివేశారు. రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు చేపట్టారు. మొయిల్స్ పంపిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

సంబంధిత పోస్ట్