ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. సెమ్రా ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. సుక్మా జిల్లా బోటెతంగో ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు బలగాలకు మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.