ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కాళింది కుంజ్ సమీపంలోని దోభీ ఘాట్ వద్ద ఓ పీవీసీ పైప్ తయారీ ఫ్యాక్టరీలో గురువారం ఈ దుర్ఘటన జరిగింది. అగ్నిప్రమాదంతో ఫ్యాక్టరీ నుంచి పొగ ఆ ప్రాంతమంతా వ్యాపించింది. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనకు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.