గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం ఏపీని ఎంతో వెనక్కి తీసుకెళ్లిందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వృథా చేసిందని ఆరోపించారు. మద్యం, ఇసుక మాఫియాలతో వైసీపీ నేతలు రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. ప్రధాని మోదీ ప్రభుత్వంలో అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థగా దేశం మారబోతోందన్నారు. విజయవాడలో మీడియాతో ఆయన ఈ మేరకు మాట్లాడారు.