ఢిల్లీలోని పండిట్ పంత్ మార్గ్ లో ఉన్న బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా కార్యాలయంలోని మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటననా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.