ఏపీలో ఇప్పటి వరకు రూ.569 కోట్లు వరద సాయం జమ

82చూసినవారు
ఏపీలో ఇప్పటి వరకు రూ.569 కోట్లు వరద సాయం జమ
ఇటీవల ఏపీలో భారీ వర్షాలు, వరదలతో ప్రజలు నష్టపోయారు. ఈ నేపథ్యంలో ఆస్తి, పంట నష్టం కింద సుమారు 4 లక్షల మందికి రూ.602 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. ఇప్పటి వరకు ప్రజల ఖాతాల్లో రూ.569 కోట్ల సాయం జమ అయింది. ఖాతాలు ఇనాక్టివ్ ఉన్న వారికి పరిహారం సోమవారం చెల్లించనున్నారు. మరోవైపు వరద సాయంలో భాగస్వాములైన వారితో సీఎం చంద్రబాబు సోమవారం విజయవాడ కలెక్టరేట్‌లో భేటీ కానున్నారు.

సంబంధిత పోస్ట్