శ్రీవారిని దర్శించుకున్న CJI డీవై చంద్రచూడ్ (Video)

75చూసినవారు
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వైకుంఠం క్యూకాంప్లెక్స్ వద్ద ఆయనకు టీటీడీ ఈవో శ్యామలరావు స్వాగతం పలికారు. అనంతరం సీజేఐ గర్భాలయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆయన కుటుంబసభ్యులకు పండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. టీటీడీ ఈవో ఆయనకు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు.

సంబంధిత పోస్ట్