ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయ్పూర్ లోని కోటా ప్రాంతంలో గల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల కంపెనీలో శుక్రవారం మధ్యాహ్నం సమయంలో భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడుతుండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో నల్లటి పొగ కమ్మేసింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనలో ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.