మెదక్ నియోజకవర్గం రామాయంపేట మండలంలోని మల్లెచెరువులో మృతదేహం కలకలం రేపింది. స్థానికులు చెరువులో మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. మృతుడు రామాయంపేటకు చెందిన దాకి రమేష్ గా పోలీసులు అనుమానిస్తున్నారు.