ఇంటర్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య

4139చూసినవారు
ఇంటర్ విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య
మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారంలో విషాదం చోటు చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటర్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన దొమ్మాట జయరాములు రేణుకా వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న కూతురు ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు చివరిసారిగా ఒక వ్యక్తి తో ఫోన్లో మాట్లాడినట్లు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ట్యాగ్స్ :