కదులుతున్న రైలు నుంచి జారిపోయిన ఓ జవాన్ ప్లాట్ఫామ్-రైలు మధ్య ఇరుక్కుపోయి దుర్మరణం పాలయ్యాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ రైల్వేస్టేషన్లో RAF అసిస్టెంట్ సబ్-ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న బిందా రాయ్ కదులుతున్న రైలు నుంచి జారిపోయాడు. ప్లాట్ఫామ్-రైలు మధ్య ఇరుక్కుపోయిన అతడు తీవ్ర గాయాలపాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మరణించాడు.