మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామానికి చెందిన పుర్ర ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రవీణ్ లిఫ్ట్ మెకానిక్ గా పని చేస్తున్నాడు. కుటుంబ కలహాల కారణంగా మనస్తాపానికి గురైన ప్రవీణ్ అర్థరాత్రి సమయంలో అక్కన్నపేట- బిక్నూర్ రైల్వే స్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు రైల్వే ఎస్ఐ తాగు నాయక్ తెలిపారు.