భారత ప్రధాని మోదీ కార్యాలయం నుంచి ఇటీవల వాట్సాప్ మెసేజ్లు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే తరహా మెసేజ్లు చాలా మంది పాకిస్థానీలకు, యూఏఈ పౌరులకు వెళ్లినట్లు వాళ్ళు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ మేరకు తమకు వచ్చిన మెసేజ్ల స్క్రీన్షాట్లను షేర్ చేస్తూ.. భద్రతపై ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత శశిథరూర్ కూడా ఆరోపణలు చేశారు.