నేటి నుంచి మిలాన్‌-2024 ప్రారంభం

1539చూసినవారు
నేటి నుంచి మిలాన్‌-2024 ప్రారంభం
ఏపీలోని విశాఖ వేదికగా నేడు మిలాన్-2024 ప్రారంభం కానుంది. ఈ నెల 27 వరకు కొనసాగే ఈ సాహస ప్రదర్శనలు చూసేందుకు 50 దేశాల నుంచి ప్రతినిధులు రానున్నారు. 20కి పైగా యుద్ధ నౌకలు, విమానాలు విశాఖ హార్బర్‌కు చేరుకుంటున్నాయి. మిత్ర దేశాలతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి, సహాయ సహకారాలు ఇచ్చిపుచ్చుకోవడానికి రెండేళ్లకోసారి ఇండియన్ నేవీ మిలాన్ వేడుక నిర్వహిస్తోంది.

సంబంధిత పోస్ట్