రోడ్డుప్రమాదం.. ధర్మపురి ఎమ్మెల్యేకు గాయాలు

297358చూసినవారు
తెలంగాణ ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌కు పెనుప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ధర్మపురికి వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న కారు జగిత్యాల జిల్లాలోని ఎండపల్లి మండలం అంబారిపేట వద్ద ప్రమాదానికి గురైంది. లారీని తప్పించే క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేతో పాటు ఇతరులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్