అధికారులపై మంత్రి ఆతిశీ ఫైర్

70చూసినవారు
అధికారులపై మంత్రి ఆతిశీ ఫైర్
ఢిల్లీ జల్ బోర్డు (డీజేబీ)పై ఆప్ మంత్రి ఆతిశీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ నీటి సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండగా నీటి ట్యాంకర్ల సంఖ్యను పెంచాలన్న ప్రభుత్వ సూచనను ధిక్కరించారని ఆరోపించారు. ట్యాంకర్లను ఎందుకు తగ్గించారో డీజేబీ అధికారులు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. హర్యానా ప్రభుత్వం రాజకీయాలు మానుకుని హిమాచల్ ప్రదేశ్ విడుదల చేసిన నీటిని ఢిల్లీకి సురక్షితంగా చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు.