తెలంగాణను అప్పులకుప్పగా మార్చారన్న మంత్రి జూపల్లి

83చూసినవారు
తెలంగాణను అప్పులకుప్పగా మార్చారన్న మంత్రి జూపల్లి
కామారెడ్డి జిల్లా జుక్కల్‌ నియోజకవర్గంలో శనివారం మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పులకుప్పగా మార్చిందని విమర్శించారు. పదేళ్ల పాలనలో గ్రామాలు, తండాల్లో సౌకర్యాలు లేవని, ఎల్లారం తండాకు ఇప్పటివరకు ఎమ్మెల్యే, ఎంపీ రాలేదని ఫైర్ అయ్యారు. ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని, అధికారంలోకి వచ్చిన వెంటనే 2 గ్యారంటీలు అమలు చేశామని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్