రాజస్థాన్లోని సంగోత్లో గురువారం షాకింగ్ ఘటన జరిగింది. స్థానిక
బీజేపీ ఎమ్మెల్యే హీరాలాల్ నాగర్కు మంత్రి పదవి దక్కింది. ఆ తర్వాత తొలిసారి నియోజకవర్గానికి ఆయన వచ్చారు. దీంతో స్థానికులు, పార్టీ అభిమానులు ఆయనకు సన్మానం ఏర్పాటు చేశారు. సన్మాన కార్యక్రమంలో అకస్మాత్తుగా స్టేజ్ కుప్పకూలింది. మంత్రితో పాటు స్టేజ్పై ఉన్నవారంతా కింద పడ్డారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.