ఢిల్లీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన రాజ్కుమార్ ఆనంద్ రాజీనామాను లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సోమవారం ఆమోదించారు. ఏప్రిల్ 10న రాజ్ కుమార్ ఆనంద్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. సీఎం కేజ్రీవాల్ ఆ సమయంలో జైలులో ఉండడంతో దానిని ఆమోదించలేదు. ఇటీవల కేజ్రీవాల్ మంత్రి రాజీనామాను ఆమోదించి లెఫ్టినెంట్ గవర్నర్కు పంపించారు. ఈడీ దాడుల భయంతో రాజ్ కుమార్ రాజీనామా చేసినట్లు ప్రచారం జరుగుతోంది.