కాంగ్రెస్ మంత్రులపై మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. ఖమ్మం జిల్లాలోని ఇల్లెందులో పర్యటించిన ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేయించాలని స్కూళ్లు, కాలేజీ యాజమాన్యాలను కాంగ్రెస్ మంత్రులు బెదిరిస్తున్నారని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు.