AP: ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలు జరగడానికి కూటమే కారణమని వైసీపీ మంత్రి జోగి రమేష్ ఆరోపించారు. "కలెక్టర్లు, ఎస్పీలు మార్చిన చోటే పెద్ద ఎత్తున హింసాత్మక సంఘటనలు జరిగాయి. ప్రజాస్వామ్యంలో హింసని ప్రేరేపించింది చంద్రబాబే. మళ్లీ సీఎంగా వైఎస్ జగన్ వస్తారు. ప్రజాస్వామ్యంలో ఈ ఎన్నికలు ఒక మచ్చలా మిగిలాయి. పూర్తి స్ధాయిలో విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి." అని మంత్రి డిమాండ్ చేశారు.