యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థాన పరిధిలోని YTDA దివ్య విడిది (ప్రెసిడెన్సియల్విల్లా)లో ఉపాధ్యాయ ఉద్యమ నేత దాచూరి రామిరెడ్డి 8వ వర్ధంతి సభలో 33 జిల్లాలకు చెందిన ప్రతినిధులతో పాటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి పాల్గొన్నాడు. ఈ సభలో మధ్యాహ్నం జెన్కో విల్లాలో దేవస్థాన నిబంధనలకు విరుద్ధంగా చికెన్తో కూడిన భోజనాలు ఏర్పాటు చేశారు. పవిత్ర పుణ్యక్షేత్రంలో చికెన్ పెట్టడమేంటని కొందరు ఉపాధ్యాయులు అవాక్కయ్యారు.