AP: పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మార్కెట్లో చేపల ధరలు పాతాళానికి పడిపోయాయి. కిలో చేపలను రూ.10-20కే విక్రయిస్తున్నారు. కొనుగోలు దారులు అతి తక్కువ ధరకే మంచి పౌష్టికాహారం లభించడంతో సంతోషంలో మునుగుతుంటే రైతులు మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 2 రోజులుగా వాతవరణ మార్పులు సంభవించడంతో చేపలు భారీగా మృత్యువాత పడుతున్నాయని.. చేసేదేమీ లేక అతితక్కువ ధరకే చేపలను అమ్ముతున్నట్లు రైతులు చెబుతున్నారు.