ఏపీలో మరోసారి ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలోని రెండు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరిన ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, షేక్ ఇక్బాల్పై మండలి చైర్మన్ అనర్హత వేటు వేసిన సంగతి తెలిసిందే. అభ్యర్థులు జులై 2వ తేదీ వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. పోలింగ్ నిర్వహించిన రోజునే ఫలితాలు వెల్లడిస్తారు. జులై 12వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు.