బీజేపీ మిత్రపక్షంగా ఉన్న బీజేడీ చీఫ్, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ను ప్రధాని నరేంద్ర
మోదీ అవమానించేలా మాట్లాడారు. ఒడిశాలోని అన్ని జిల్లాలు, హెడ్క్వాటర్ల పేర్లు చెప్పాలని అన్నారు. ఒడిశాలోని కంధమాల్లో శనివారం జరిగిన ఎన్నికల సభలో
మోదీ ప్రసంగించారు. ‘ఇంత కాలం ముఖ్యమంత్రిగా ఉన్న ‘నవీన్ బాబు’కు సవాల్ చేస్తున్నా. కాగితంపై చూడకుండా ఒడిశా జిల్లాలు, వాటి రాజధానుల పేర్లు చెప్పమని అడగండి’ అని జనాన్ని ఉద్దేశించి అన్నారు.