రైల్వేలను మోదీ సర్కార్‌ పట్టించుకోవడం లేదు: మమతా బెనర్జీ

64చూసినవారు
రైల్వేలను మోదీ సర్కార్‌ పట్టించుకోవడం లేదు: మమతా బెనర్జీ
పశ్చిమ బెంగాల్‌లోని డార్జలింగ్‌ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద ఘటనా స్ధలాన్ని మమతా బెనర్జీ సందర్శించారు. సహాయక చర్యలను పర్యవేక్షించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రైల్వేలను మోదీ సర్కార్‌ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. తనకు రైల్వేల గురించి క్షుణ్ణంగా తెలుసని అన్నారు. రైల్వేల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నదో ఎవరికీ తెలియని పరిస్ధితి నెలకొందని, రైల్వే మంత్రిత్వ శాఖలో సమస్యలు చుట్టుముట్టాయని ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్