ప్రధాని మోదీ, బీజేపీ ఎంపీ అనురాగ్ ఠాకూర్ సత్యదూరమైన ప్రకటనలు చేస్తూ సభను తప్పుదోవ పట్టించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు కాంగ్రెస్ కాంగ్రెస్ సీనియర్ నేత మాణికం ఠాగూర్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు లేఖ రాశారు. రాజ్యాంగంలోని 115(1) నిబంధన ప్రకారం వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ మహిళలకు నెలకు రూ.8,500 ఇస్తామని కాంగ్రెస్ తప్పుడు వాగ్దానం చేసిందని అన్నారని ఠాకూర్ లేఖలో ప్రస్తావించారు.